మెడనొప్పి

మెడనొప్పి 

మెడనొప్పి పాతుకుంటే తస్మాత్‌ జాగ్రత్త. మెడ నుంచి భుజానికో, చేతుల చివరలకో నొప్పి పాకుతూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ విధంగా నొప్పి పాకుతూ ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు ప్రముఖ న్యూరోసర్జన్‌ డా జగదీశ్‌.
మెడనొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.మనం నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగా మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది.
వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్ళే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్త ప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్తప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తం అంతగా సరఫరా ఉండదు. దీనిమూలంగా నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు అవడం జరుగుతుంది.మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్ను పూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ అని, రెండవ దానిని ఆక్సిస్‌ అని అంటారు.
ఆ తర్వాత పూసలను వరుసగా సర్వికల్‌ 3,4,5,6,7 అంటారు. ఇవన్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. వీటిలో సై్పనల్‌ కెనాల్‌ ఉంటుంది. దాని ద్వారా సై్పనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళకు, చేతులకు, నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు మరొక దానికి మధ్యలో ఉండే ఇంటర్‌ వర్టిబ్రల్‌ పారామినా నుండి ఒక్కొక్క నరం బైటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది.
ఎక్స్‌రే- స్కానింగ్‌…
మెడ నొప్పి వచ్చేవారికి ఎక్స్‌రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకుని దానిని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగానే పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైనా వచ్చి చేరాయా? అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. అంత సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసుకుని ఆ వత్తిడి దేని వల్ల వచ్చింది? ఏదైనా ముక్క ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? వంటివన్నీ తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంతమేరకు ఆ సమస్య ఉందో గమనించి దానికి చికిత్స చేస్తారు.
పర్సనల్‌ కేర్‌…
మెడనొప్పి వచ్చినప్పుడు వేడినీళ్ళలో మెత్తటి వస్త్రాన్ని ముంచి. పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి కాపడం పెడితే సాధారణ నొప్పి నుంచి మం చి రిలీఫ్‌ లభిస్తుంది.మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాం తి ఇవ్వాలి. ఎందు కంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అం దుకని నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాం తి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్లు, ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో పాటుగా రోజుకి అయిదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటప్పుడు ఒకవైపుకే వంగడం సరికాదు.
- డా|| జగదీష్‌. సిహెచ్‌.

న్యూరోసర్జన్‌
అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌
ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 9000114040