ఆరాదన అంటే ఏమిటి ?



మనకు ప్రియమైన స్నేహితుడు మన ఇంటికి వస్తాడు అని తెలిసిందనుకోండి, మనం ఎంత సంతోషిస్తాం. విషయం తెలిసినప్పటి నుండే ఇంటిని శుభ్రపరచుకుంటాం, మంచిగా అలంకరించుకుంటాం. రాగానే తనకి ఇష్టమైన ఆహారా న్ని ప్రత్యేక శ్రద్ధతో, స్వయంగా మనమే వండి రుచిగా తయారుచేస్తాం. మన స్థాయిని బట్టి వీలైతే వెండి కంచంలో వడ్డిస్తాం. ఏదో మనం చూపే అభిమానం. ఆ వ్యక్తికి అసలు అవసరం కేవలం ఆహారం మాత్రమే కానీ వెండి కంచం కాదు. ఆ వ్యక్తి మనం చేసిన పదార్థాన్ని స్వీకరిస్తాడు తప్ప కంచాన్ని కాదు. మన వెండి పాత్రలు బాగున్నాయి అని తీసుకేళ్తానంటే ఒప్పుకుంటామా, ఒప్పు కోనే ఒప్పుకోము. అది పద్ధతే కాదు. అట్లానే మనం భగవంతునికి అర్పించేవి పాత్రల వంటివి, భగవంతుడు మన ప్రేమను మాత్రమే స్వీకరిస్తాడు. భగవంతుడు కోరేది మన నుండి కృతజ్ఞత, ప్రేమ కానీ వస్తువులు కాదు. నేను కేవలం ప్రేమను మాత్రమే ఇస్తాను అంటే తగదు. అట్లాంటిది నిద్రాహారాలు మాని తపస్సు ఆచరించే ఋషులకు వర్తించవచ్చు కానీ మనకు సరిపడదు. 

శ్రీవారి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే..? 
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చ కర్పూర తిల కాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందని పురోహితు లు అంటున్నారు. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వే సుకుని తాగితే స్వామివారి ప్ర సాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.వ్యాపారాలు ప్రతిరోజూస్వామివారి పచ్చక ర్పూ ర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యా పారం అభివృద్ధి చెందుతుందని తితిదే అర్చకులు అంటున్నారు. ఇంకా స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వారు చెబుతున్నారు. స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి. 

స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది. అలాగే స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టిదానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని దే వాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయని తితిదే ప్రధాన అర్చకులుఅంటున్నారు.స్వామివారి పచ్చకర్పూరం,పాలతోమంగళవారం సుబ్ర హ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆపాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదో షాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది. 
కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కుంకుమ, గంధం కలిపిన నీటిని శంఖంతో పో సుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. గంధం, తిలలు కలిపిన రజిత పాత్రలోని నీటితో స్నానమాచ రించడం వలన కుజదోషాల తొలగిపోతాయి. ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసి నట్లయితే బుధగ్రహ దోషాలు తొలగి పోతాయి. మర్రి, మారేడు కాయలను బంగారు పాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ రజిత పాత్రలో ని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుం ది. ఇక నువ్వులు, మినువులు కలిపిన లో„హ పాత్రలోని నీటితో స్నానం చేయడ ం వలన శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. ఇక గేదె కొమ్ము (డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు తొలగిపో తాయి. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొల గిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వినాయకునికి తులసీ పత్రమంటే అస్సలు ఇష్టముండదట! 
వినాయకునికి తులసీపత్రమంటే అసలుఇష్టముండదట! ఎందుకో తెలుసా?
అయితే ఈ కథనం చదవండి. వినాయకచవితినాడు అనేక పత్రాలు, పుష్పా లతో పూజిస్తాం. అయితే తులసి పత్రం మాత్రం వినాయక పూజకు నోచుకోదు అంటున్నారు పండితులు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడక పోవటానికి కారణమేమిటంటే ఒకసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణ యం చేసుకోమని కోరింది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుతక్ర కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది. ప్రతి గా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకా లం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామి ని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతి ంచి,రాక్షసుని చెంత కొంతకాలంఉండి,ఆపై పవిత్ర… మై న తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందు కే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్ట పడడని పండితులు అంటున్నారు.

పూజ గదిలో దేవీ-దేవీతల ఫోటోలు ఎలా అమర్చుకోవాలి? 
పూజ గదిలో దేవీ-దేవీతల ఫోటోలు ఎలా అమ ర్చుకోవాలో తెలుసా? పూజ గదిని సాధ్య మైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికికారణం తెల్లవారు జాము నే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. పూజగదిలో ఆదిదేవుడైన గణపతి దేవుని విగ్రహ ము లేదా చిత్రముమధ్యలో అమర్చుకోవాలి. పురు ష దేవతలు గణపతికి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున, స్త్రీ దేవతలు గణపతికి ఎడమ వైపున వచ్చేవిధంగా అమర్చుకోవాలి. సీతారాము డు, లక్ష్మీనారాయణడు వంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాల ని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

నల్లమలకొండల్లో ఉన్న మాధవి దేవి శక్తిపీఠం! 
108 శక్తి పీఠాల్లో శ్రీశైలం మాధవి దేవి ఆల యం సుప్రసిద్ధమైనది. సతీదేవి కంఠభాగం ఇక్కడ పడినట్లుగా చెపుతారు. అరుణాసురడనే రాక్షసుని అమ్మవారు ఈ ప్రదేశంలో వధిం చినట్లు ప్రతీతి. ఇదే శ్రీశైలం. దీనిని దక్షిణ కైలాసమని, దక్షిణ కాశి అని అభివర్ణిస్తారు. ఈ శక్తిపీఠ క్షేత్రములో, శ్లోకం ప్రకారం (భ్రమరాంబ అనబడే) మాధవీదేవి ఆరాధించబడుతున్నది. ఆదిశంక రాచార్యులు ఇక్కడ తపస్సు చేసినట్లు, సౌందర్యలహరీ స్త్రోత్రం ఇక్కడే రచించిన ట్లు, దీనిని కనకధారా స్తోత్రంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో నందికొట్కూరు తాలూకాలో ఉంది శ్రీశైల దేవీ పీఠం. ఇది నల్లమలకొండల్లో ఉంది. మాచర్ల దాకా రైల్లో వెళ్లవచ్చు. డోర్నాల నుండి ఘాట్‌ రోడ్డులో 51 కి.మీ. హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో నేరుగా వెళ్ళొచ్చు. ఇకపోతే అహోబిలము 160 కి.మీ స్వామివారు మల్లికార్జునుడు. ఈ లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలల్లో ఒకటి రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుండి బస్సుల్లో ఇక్కడకు చేరవచ్చును.

మంగళవారం దుర్గమ్మ తల్లికి దీపమెలిగిస్తున్నారా.. 
మంగళవా రం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చే కూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇంకా మం గళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచ…రిం చి ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలం కరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.అనంతరం సాయంత్రం ఆరు గం టల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించ కోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్నకార్యాలుదిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. 

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు,
నమ్మకము ప్రధానము నమ్మకము మూఢనమ్మకము కాకూడదు.
-వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కా నీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజ రాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాత కు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తపుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవత లు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు 
రుదక్ష్రలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుదక్ష్రలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుదక్ష్రలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేర తాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేం దుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుదక్ష్ర. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడా నికి రుదక్ష్ర అసలైన మార్గం చూపుతుం ది. రుదక్ష్రను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుదక్ష్రలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతా యి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుదక్ష్రమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుదక్ష్రమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుదక్ష్రలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చే తులు, చెవులకు, రుదక్ష్రలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుదక్ష్ర ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుదక్ష్రలపై ఉండే ముఖాల ఆధారంగా రుదక్ష్రలను ఇరవ య్యొక్క రకాలుగా విభజించారు.

రుదక్ష్రలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుదక్ష్రమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుదక్ష్ర మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుదక్ష్రమాలను మరొకరు ధరించకూడదు.
4. రుదక్ష్రమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుదక్ష్రమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుదక్ష్రమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుదక్ష్రమాల ధారణవిధి : 
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుదక్ష్రలను శుద్ధిచేసి శివపూజచేయాలి. ఆతర్వాతే రుదక్ష్రనుదరించాలి. రుదక్ష్ర ను ధరించినవెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుదక్ష్రల పూర్తిసమాచారాన్ని సేకరించి,సిసలైన పద్ధతిప్రకారం, గురువుసమక్షంలో ధరించి, సాధన చేయాలి.

రుదక్ష్రమాలను ధరించవలసిన తిథులు : 
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుదక్ష్రలతో పూజించడం మహాశ్రేష్టం. రుదక్ష్రలను ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరా ణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్‌ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుదక్ష్ర చెట్లు పెరుగుతాయి.